ఉద్యోగుల కోసమే ఉద్యమం.. నాయకుల ప్రయోజనం కోసం కాదు: బొప్పరాజు

  • ఏలూరులో ప్రాంతీయ సదస్సు
  • పాల్గొన్న వివిధ జిల్లాల నాయకులు, ఉద్యోగులు
  • ఉద్యోగ సంఘాల్లో చీలక తేవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులు మరో ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మూడో దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిన్న ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. అంతకుముందు నగరంలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతోపాటు వివిధ జిల్లాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ ఉద్యమం ఉద్యోగుల కోసమే కానీ, నాయకుల ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 80 రోజులుగా ఉద్యమం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల్లో చీలికలు తేవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని బొప్పరాజు తేల్చి చెప్పారు.

Bopparaju venkateswarlu
Andhra Pradesh
Amravati JAC

More Telugu News